
కోలీవుడ్, టాలీవుడ్ లలో మంచి క్రేజ్ ఉన్న నటుల్లో ‘కార్తీ’ ఒకరు. తమిళ స్టార్ హీరో ‘కార్తీ’ నటించిన ‘సర్దార్’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధిస్తోంది. దీపావళి పర్వదినం సందర్భంగా.. అక్టోబర్ 21న సినిమా విడుదలైంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాలో డబుల్ రోల్ పోషించిన ‘కార్తీ’ స్పైగా, పోలీస్ ఆఫీసర్ గా అలరించారు.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. లెటెస్ట్ గా ‘సర్దార్ 2’చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ టీజర్ విడుదల చేశారు. పోలీస్ ఆఫసర్ గా ఉన్న కార్తీ స్పైగా మారడం.. తర్వాత ఏం చేశారన్న కథాంశంతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా.. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు.