పూజా కార్యక్రమాలతో హస్తినాపురం స్టార్ట్

పూజా కార్యక్రమాలతో హస్తినాపురం స్టార్ట్

కార్తీక్ రాజు  హీరోగా రాజా గండ్రోతు దర్శకత్వంలో కాసు రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘హస్తినాపురం’. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ఫస్ట్ షాట్‌‌కి దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య స్క్రిప్ట్‌‌ను అందజేశారు.  అనంతరం హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘దర్శకుడు అద్భుతంగా కథ రాసుకున్నాడు. రెగ్యులర్ సినిమాలా కాకుండా కొత్త పాయింట్‌‌తో ఈ చిత్రం రాబోతోంది’ అన్నాడు. 

‘మేకప్ మెన్, మేనేజర్‌‌గా ఉండే నన్ను.. కార్తీక్ రాజు ఈ చిత్రంతో నిర్మాతను చేశారు. దమ్మున్న కథతో వస్తున్నాం’ అని కాసు రమేష్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘టైటిల్‌‌ తరహాలోనే పాజిటివిటీ ఉన్న సినిమా ఇది. వినాయక్ గారి దగ్గర వర్క్ చేసిన నేను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నా. మంచి టీమ్‌‌తో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది’ అన్నాడు. హీరోయిన్ నిషా,  మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.