29న వారణాసిలో   ‘కాశీ తెలుగు సంగమం’ : జీవీఎల్ నర్సింహా రావు

29న వారణాసిలో   ‘కాశీ తెలుగు సంగమం’ : జీవీఎల్ నర్సింహా రావు

న్యూఢిల్లీ, వెలుగు: గంగా పుష్కరాలను పురస్కరించుకొని ఈ నెల29న వారణాసిలో 'కాశీ తెలుగు సంగమం' నిర్వహించనున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. గురువారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన చొరవతో కాశీలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

వీటిని ప్రధాని కార్యాలయం, జిల్లా యంత్రాంగం కలిసి నిర్వహించబోతున్నట్లు వివరించారు. 5 ప్రత్యేక బస్ రూట్లు, 24 గంటల పాటు హెల్ప్ లైన్, పోలీస్ గస్తీ సహా ఇతర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తెలుగు యాత్రికులకు ఇబ్బంది ఉండేదని.. ఈ సారి విశాఖ, తిరుపతి, గుంటూరుతో పాటు సికింద్రాబాద్ నుంచి వారణాసి చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని జీవీఎల్ పేర్కొన్నారు.