
ఎక్కడో విదేశాల్లో పుట్టి, మన దేశానికి వచ్చి, బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది కత్రినా కైఫ్. తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు లాంటి చిత్రాలు చేశాకే బీటౌన్లో మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే ఆ తర్వాత టాలీవుడ్ వైపు మళ్లీ రాలేదు కత్రినా. అందుకు కారణం.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోవడమే. ప్రస్తుతం ఫోన్ భూత్, టైగర్ 3 చిత్రాల్లో నటిస్తోంది కత్రినా. నిన్న ఆమె బర్త్ డే సందర్భంగా ‘ఫోన్ భూత్’ మూవీ నుంచి ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఆ సినిమా షూటింగ్ లొకేషన్లో జరిగిన ఫన్నీ ఇన్నిడెంట్స్తో ఈ వీడియోని రూపొందించారు. ఇషాన్ ఖత్తర్, సిద్ధాంత్ చతుర్వేది హీరోలుగా గురుమీత్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ర్యాపర్గా కనిపించబోతోంది కత్రినా. అందుకు తగ్గట్టుగానే తన లుక్ డిఫరెంట్గా, కొత్తగా ఉంది. కత్రినా పెళ్లి కారణంగా కాస్త ఆలస్యమవడంతో.. ఈ మూవీ రిలీజ్ డేట్ని ఇటీవల మార్చారు. నవంబర్ 4న విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేశారు.