
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో హీరోయిన్గా నటించింది కావ్య థాపర్. ఆగస్టు 15న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా కావ్య థాపర్ చెప్పిన విశేషాలు.
‘‘నాకు పూరి జగన్నాథ్ గారి హీరోయిన్ అవ్వాలని ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్’కి ఆడిషన్ ఇచ్చాను కానీ కుదరలేదు. ఇప్పుడు డబుల్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే ఈ సినిమాలో అవకాశం రావడం మరింత హ్యాపీగా ఉంది. పూరి గారు గ్రేట్ డైరెక్టర్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. హీరో రామ్, సంజయ్ దత్ లాంటి స్టార్ కాస్ట్... పూరి, మణిశర్మ గార్ల కాంబోలో వర్క్ చేయడం లక్కీగా ఫీలవుతున్నా. ఇందులో నా క్యారెక్టర్ చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏదైనా సొంతంగా నేర్చుకునే అమ్మాయి. తను చాలా స్మార్ట్, అదే సమయంలో తనలో ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది. నాకు ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి.
ఒక యాక్టర్గా ఎప్పటినుంచో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎదురుచూశా. ఈ సినిమాతో రావడం ఆనందంగా ఉంది. రామ్ చాలా పాషనేట్ యాక్టర్, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హైలీ ఎనర్జిటిక్గా ఉంటారు. ఆయనతో డ్యాన్స్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియెన్స్. సంజయ్ దత్ గారితో వర్క్ చేయడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం డ్రీమ్ కమ్ ట్రూ లా అనిపించింది. ‘ఇస్మార్ట్ శంకర్’కి దీనికి కంపారిజన్ లేదు. ‘డబుల్ ఇస్మార్ట్’ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా హిందీలోనూ రిలీజ్ కావడం ఎక్సయిటింగ్గా ఉంది. ఇదొక బ్లెస్సింగ్లా భావిస్తున్నా. ప్రస్తుతం గోపీచంద్ గారితో ‘విశ్వం’ మూవీలో నటిస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి’’.