
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈపీసీ సేవలు అందించే నాసిక్కు చెందిన కేబీసీ గ్లోబల్ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన రంగంలో విస్తరణలో భాగంగా ధరణ్ ఇన్ఫ్రా సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పూర్తిగా యాజమాన్యంలోని సబ్సిడరీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13న జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు ఈ నిర్ణయాన్ని ఆమోదించింది. కొత్త కంపెనీ సౌర, హైబ్రిడ్ ఇంధన పరిష్కారాలపై దృష్టి పెడుతుంది. వంద శాతం యాజమాన్యం ధరణ్ ఇన్ఫ్రా-ఈపీసీ లిమిటెడ్ వద్దే ఉంటుంది.
ధరణ్ ఇన్ఫ్రా సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన మాడ్యూల్స్, సెల్స్, ఉపకరణాల తయారీ, డిజైన్, అభివృద్ధి చేస్తుంది. అంతేగాక పరిశోధన, వ్యాపారం, కొనుగోలు, అమ్మకం, హోల్సేలింగ్, రిటైలింగ్, పంపిణీ, దిగుమతి, ఎగుమతి, అసెంబుల్, ఫ్యాబ్రికేటింగ్, రిపేర్, నిర్వహణ, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, హైబ్రిడ్ వ్యవస్థలను నిర్వహించడం వంటివి ఉంటాయి. - సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఎండ్- టు- ఎండ్ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.