కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దు

కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దు

వరంగల్ రూరల్:  ఈ దశాబ్దం మాదే అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. కేసీఆర్ తర్వాత సీఎం ఎవరనే చర్చ సాగుతోంది. భిన్న వాదనలు వినిపిస్తోన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పదవీ చేపట్టేందుకు అన్ని విధాలా అర్హుడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన మనసులోని మాటను బయటపెట్టారు. కేసీఆర్ తర్వాత నెక్ట్స్ సీఎం ఎవరనే అంశాన్ని లేవనెత్తారు. కేసీఆర్ తర్వాత సీఎం అయ్యే అర్హత ఒక్క కేటీఆర్‌ కు మాత్రమే ఉందన్న ఎర్రబెల్లి.. దీనిపై రెండో మాటకు తావులేదని తేల్చి చెప్పారు.

“మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలున్నాయి. ఆయన అన్ని విధాల సమర్థుడు. ఆయన నాయకత్వంలో జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించాం. ఆయన సీఎం ఎప్పుడవుతాడో కేసీఆర్ నిర్ణయిస్తారు. చంద్రబాబు కొడుకు లోకేష్ లా, సోనియాగాంధీ కోడుకు రాహులో గాంధీలా అసమర్థుడు కాదు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం ప్రభుత్వాన్ని నడపలేదా, రాష్ట్రానికి స్వాతంత్ర్యం తెచ్చిన కేసీఆర్ కుటుంబం ఎందుకు పాలించొద్దు” అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.