- టీఆర్ఎస్పై ఇక ఆఖరి పోరాటం
- మోడీ స్కరారునూ దించేయాలి
- రాష్ట్రానికి గులాబీ చీడ: రేవంత్
- కేసీఆర్..ఏకాకి: కోదండరాం
- మన సీఎం మరో నిజాం: చాడ
- భారత్బంద్, రోడ్ల దిగ్బంధాన్ని
- విజయవంతం చేయాలని పిలుపు
రాష్ట్రంలో కేసీఆర్ పతనం మొదలైందని, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా మండల స్థాయి నుంచి కదలిరావాలని అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనకు ఏకమై పోరాడినట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడానికి పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు రావాలన్నారు. బుధవారం అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర మహా ధర్నా జరిగింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ), సీపీఐ ఎంఎల్ లిబరేషన్తోపాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్, వెలుగు:‘‘కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్పతనం మొదలైంది. అఖిలపక్షం తలపెట్టిన ఈ మహా ధర్నా రాజకీయాల్లో కీలక మార్పు తేనుంది. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా మండల స్థాయి నుంచి దేశ స్థాయి దాకా జనం కదిలొస్తున్నరు. తెలంగాణ సాధనకు ఏకమై పోరాడినట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడానికి పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు రావడం శుభసూచకం” అని పలు పార్టీల నాయకులు అన్నారు. బుధవారం అఖిల పక్షం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర మహా ధర్నా జరిగింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీటీడీపీ, టీజేఎస్, సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ), సీపీఐ ఎంఎల్లిబరేషన్ తోపాటు పలు ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
కేసీఆర్.. సామాన్యుల నడ్డి విరుస్తున్నరు: రేవంత్
రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కామెంట్ చేశారు. తెలంగాణ విముక్తి కోసం ఆ చీడను తరిమి కొట్టి వదిలించుకోవాల్సిన అవసరముందన్నారు. ‘‘సీఎం కేసీఆర్కు ప్రధాని మోడీ అండగా ఉన్నారు.అందుకే టీఆర్ఎస్ ఆగడాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్అనే కేడీ మోపైండు. సామాన్యుల నడ్డి విరుస్తున్నరు. కేసీఆర్వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కట్టబెట్టుకుంటున్నరు. జాతి సంపదను అంబానీ, అదానీలకు మోడీ కట్టబెడుతున్నరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో దేశం, రాష్ట్రం ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఉమ్మడి పోరాటం చేయాలె” అని పిలుపునిచ్చారు. ఈ నెల 27న భారత్ బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 30న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలివ్వాలన్నారు. పోడు భూముల కోసం అక్టోబర్ 5న అశ్వరావు పేట నుంచి ఆదిలాబాద్ దాకా రోడ్లు నిర్బంధించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల ఖమ్మంలో పోడు భూముల స్వాధీనం సందర్భంగా అరెస్టయిన తన మూడు నెలల పాపతో పాటు అరెస్టయిన ఓ మహిళను సభకు రేవంత్ పరిచయం చేశారు. ‘‘దశాబ్దాలుగా పోడు చేసుకుని బతుకుతున్న గిరిజన కుటుంబాలను హరితహారం పేరుతో కేసీఆర్సర్కార్ వెళ్లగొట్టింది. అడ్డుపడ్డ వాళ్లను ఇట్ల జైళ్ల పెడుతున్నది. మూడు నెలల పాప కూడా తల్లితో పాటు జైలుకు పోవాల్సొచ్చిందంటే తెలంగాణలో పుట్టుడే ఆ చిన్నారి పాపమైపోయింది! కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇంతకన్నా అన్యాయం ఇంకేముంటది?” అంటూ దుయ్యబట్టారు.
దేశాన్ని కాపాడుకునే ఉద్యమం: ఏచూరి
మోడీ, కేసీఆర్సర్కార్ల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ప్రజా ఉద్యమం రావాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. ఇది దేశాన్ని కాపాడుకునే ఉద్యమంగా మారాలన్నారు. మహా ధర్నాకు కాంగ్రెస్తోపాటు 19 పార్టీలు కలిసి రావడం హర్షణీయమన్నారు.
దేశంలో గుజరాత్ గజదొంగలు: నారాయణ
ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా అఖిల పక్ష పోరు సాగాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. ఇప్పుడు దేశమంతటా గుజరాత్ గజదొంగలే ఉన్నారన్నారు.
పోరాటాలకు టీడీపీ మద్దతు: రావుల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సంప్రదించకుండా చట్టాలు తెచ్చి సాగు కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చాయని టీటీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేసే పోరాటాలకు టీడీపీ మద్దతు ఉంటుందన్నారు.
యుద్ధంలా ఆందోళనలు: తమ్మినేని
మోడీ, కేసీఆర్ ప్రభుత్వాల మీద ప్రజాందోళనలు యుద్ధంలా సాగాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. అక్టోబర్ 5న పోడు పోరులో బాధిత రైతులతో రాష్ట్రంలోని రోడ్లన్నీ స్తంభింపజేస్తామన్నారు. అఖిల పక్ష పోరాటం చూసి టీఆర్ఎస్కార్యకర్తలు బయట తిరగాలంటే భయపడాలన్నారు.
ప్రజల హక్కులను హరించారు: చాడ
కేసీఆర్మరో నిజాం అని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజల హక్కులన్నింటినీ హరించారన్నారు. సాగును మోడీ పూర్తిగా ప్రైవేటుపరం చేయజూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్కు వేల కోట్ల కమీషన్లు: నాగం
తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే ఆర్థికంగా బలపడిందని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారు. ప్రతీ ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి కనిపిస్తుంది. నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాపై కూడా శ్రద్ధ పెట్టలేదు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే ఒప్పుకొని రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. కేసీఆర్ అవినీతిపై ఉమ్మడి పోరాటాలు జరగాలి” అన్నారు.
సర్కారే దోపిడీకి తెగబడ్డది: కోదండరాం
ప్రగతి భవన్లో కేసీఆర్ ఏకాకిగా ఉంటే ప్రతిపక్షాలన్నీ ధర్నా చౌక్లో ఉన్నాయని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ‘‘ఉద్యోగాల్లేక రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పేదల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దోచుకుంటోంది. ఇసుక, భూ దందాలు చేస్తున్నది. వీటిపై అఖిల పక్షం అన్ని స్థాయిల్లో పోరాటం చేయాలి” అని
పిలుపునిచ్చారు.