
హైదరాబాద్, వెలుగు: మళ్లీ అధికారంలోకి వస్తే వాడుకుందామన్న ఆలోచనతో అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ కొనుగోలు చేసి దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్ కార్లు త్వరలోనే బయటకు రానున్నాయి. విజయవాడలోని వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ పార్క్లో గల త్రినయన ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీలో ఇవి ఉన్నట్లు సెక్రటేరియెట్ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే వీటిని రాష్ట్రానికి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కోటి రూ. 3 కోట్ల విలువైన 22 ల్యాండ్ క్రూజర్లను కేసీఆర్ కొనుగోలు చేసి విజయవాడలో దాచిపెట్టారని బుధవారం మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి వెల్లడించిన విషయం తెలిసింది. దీంతో అధికారులు వాటిని బయటకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు.