పంపకాల్లో తేడాలతోనే.. కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయితీ : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

పంపకాల్లో తేడాలతోనే.. కేసీఆర్ ఫ్యామిలీలో పంచాయితీ : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

కొత్తకోట, వెలుగు: తెలంగాణ ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా దోచుకున్న డబ్బులు పంచుకోవడంలో తేడాలు రావడంతోనే, కేసీఆర్​ ఫ్యామిలీలో పంచాయితీ వచ్చిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఓ గార్డెన్​లో శుక్రవారం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్​, మైనార్టీలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్​ పార్టీనే అని తెలిపారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరుపేదలను గుర్తించి ఇండ్లు కట్టిస్తోందని చెప్పారు.

బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలతో కొ త్తకోట మండలంలోని మిరాసిపల్లి, పామాపురం గ్రామాల్లో 40  డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు ఇచ్చి మండలం మొత్తం ఇండ్లు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. మండలానికి 448, కొత్తకోట పట్టణానికి 146  ఇండ్లను మంజూరుచేశామని తెలిపారు. రెండు నెలల కింద రామనంతపురం గ్రామానికి 66 ఇండ్లు ఇచ్చామని గుర్తు చేశారు. కొత్తకోటలో 2,440 రేషన్​కార్డులు  ఇస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్​ పల్లెపాగ ప్రశాంత్, శ్రీను, బీచుపల్లి, పీజే బాబు, బోయజ్, ఎల్లంపల్లి నరేందర్​రెడ్డి, రాము, మోహన్​రెడ్డి పాల్గొన్నారు.