
దేశ రాజకీయాలంటూ సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు బీజేపీ సీనియర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఒరగబెట్టిందేమి లేదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల మయం చేశారని ఖమ్మంలో ఆరోపించారు. మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మంకు వచ్చింది..అభివృద్ది పనుల కోసం కాదని.. పార్టీలో ఉన్న గొడవలను సర్దుబాటు చేసేందుకేనన్నారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. అమృత్ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే ఖమ్మం పట్టణాన్ని అభివృద్ధి చేశారన్నారు. కేంద్రం నిధులతో అభివృద్థి చేసినా..క్రెడిట్ మాత్రం తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. అటు ప్రధాని మోడీ పాలనలో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.