బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌కు బుద్ధి చెప్పాలి : కీర్తిరెడ్డి

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌కు బుద్ధి చెప్పాలి : కీర్తిరెడ్డి

రేగొండ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌కు బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి చెప్పారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచలో బుధవారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గూడెపల్లి, బాగిర్తిపేటలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడునూతుల నిశిధర్‌‌‌‌రెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, లింగంపెల్లి ప్రసాద్‌‌‌‌రావు, పోలుసాని తిరుపతిరావు, దాసరి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలువురు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.