తెలంగాణ ఎన్నికలపై జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం

 తెలంగాణ ఎన్నికలపై జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం

2023 నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు  రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలోని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశానికి  భేటీకి నడ్డాతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, పార్టీ తెలంగాణ ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాష్ జావడేకర్‌ హాజరయ్యారు.  

అభ్యర్థుల జాబితాతో పాటుగా ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యహాలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ  వారం చివరికల్లా 60 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి జాబితాలో  20 మంది బీసీలకు  చోటు దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా సస్పెషన్ కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.