ToxicTheMovie:'టాక్సిక్‌’ అప్‌డేట్ ఇచ్చిన ‘కేజీఎఫ్‌’ హీరో యశ్

ToxicTheMovie:'టాక్సిక్‌’ అప్‌డేట్ ఇచ్చిన ‘కేజీఎఫ్‌’ హీరో యశ్

స్టార్ హీరో యశ్‌ (Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు కావడంతో ఇటీవల దీనికి సంబంధించిన ఎన్నో రూమర్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. 

తాజాగా ‘కేజీఎఫ్‌’ హీరో యష్ అధికారిక అప్‌డేట్‌ ఇచ్చారు. ఇవాళ ఆగస్ట్ 8న షూటింగ్‌ షురూ చేసినట్లు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు. యశ్‌కు నంబర్‌ 8 అంటే చాలా సెంటిమెంట్‌. అందువల్లే నేడు (8-8-2024) టాక్సిక్‌ సెట్‌లో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్బంగా టాక్సిక్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో సందడి చేస్తున్నాయి. ఇదివరకే మేకర్స్ టాక్సిక్ రిలీజ్ డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీలైనంత త్వరగా టాక్సిక్ షూటింగ్‌ కంప్లీట్ చేసి 2025 ఏప్రిల్‌ 10న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

అలాగే ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే..ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ యశ్‌కి జోడిగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అందులో ఒకరు బ్యూటీ కరీనా కపూర్ కాగా మరొకరు శృతి హాసన్ అంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాదు..మొదట సాయిపల్లవి పేరు బయటకురాగా..ఆ తర్వాత కరీనా కపూర్‌, శ్రుతిహాసన్‌, కియారా అడ్వాణీల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

టాక్సిక్ సినిమా విషయానికి వస్తే..ఇదొక తోబుట్టువ‌ల క‌థ అని..య‌శ్ సోద‌రి పాత్ర‌లోనే క‌రీనా న‌టిస్తుంద‌ని..జోడీగా కాదంటూ  టాక్ వినిపిస్తోంది.అక్కా-తమ్ముడు సెంటిమెంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా డైరెక్టర్ గీతూ మ‌లుస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.ఈ ఒక్క వీడియో సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలను పెంచేసింది. మరి కేజీఎఫ్ తరువాత యశ్‌ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియెస్ట్ చేస్తుందో చూడాలి.