గద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్

గద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు  : కేఏ పాల్

ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ గద్దర్కు రూ.150 కోట్లిచ్చి మునోగుడు ఉపఎన్నికలో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. పాలనాపరంగా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ అవసరమా అని ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే కేఏ పాల్ అధికారంలోకి రావాలని, ప్రజాశాంతి పార్టీలో చేరుతామని లక్షల మంది వాట్సప్ మెసేజ్లు చేస్తున్నారని పాల్ చెప్పారు. 70 శాతం తెలంగాణ ప్రజలు కేఏ పాల్ పాలన కోరుకుంటున్నారని.. బంగారు తెలంగాణ కావాలనుకునేవారు ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.