కారేపల్లి, వెలుగు: పంట పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గేటురేలకాయలపల్లికి చెందిన వాంకుడోత్ పుల్లు(58) వ్యవసాయం చేస్తున్నాడు. తన మూడున్నర ఎకరాలతో పాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. తన సొంత భూమిలో మిర్చి సాగు చేసి, కౌలుకు తీసుకున్న జాగలో పత్తి పెట్టాడు. అధిక వర్షాలకు పత్తి దెబ్బతినగా మిర్చితోటకు వైరస్ సోకింది. పెట్టుబడులకు నిరుడు తీసుకున్న అప్పు తీరకపోగా, ఈసారి కూడా పెట్టుబడికి అప్పయింది. రెండేండ్లలో అసలే రూ.5 లక్షలు దాటింది. దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారం రోజులుగా అప్పు ఎలా తీర్చాలనే విషయంపై దిగులుగా ఉంటున్నాడు. సోమవారం ఉదయం చేనుకాడికి వెళ్లొస్తానని చెప్పి మిర్చితోట కెళ్లి పురుగు మందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న పుల్లును పక్క రైతులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
- తెలంగాణం
- November 30, 2021
లేటెస్ట్
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు