
ప్రముఖ నటి ఖుష్బూ సుందర్కు చెన్నై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ఆమె.. విమానం దిగిన తర్వాత వీల్ఛైర్ కోసం అరగంటపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆమె.. ట్విటర్ వేదికగా ఎయిర్లైన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డియర్ ఎయిరిండియా.. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకెళ్లేందుకు మీ వద్ద కనీసం వీల్ఛైర్ కూడా లేదు. లిగ్మెంట్ గాయం కారణంగా కట్టుతో ఉన్న తాను చెన్నై ఎయిర్పోర్టులో చక్రాల కుర్చీ కోసం 30 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా సిబ్బంది పై అసహనం వ్యక్తం చేశారు. తాను అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత సిబ్బంది వచ్చి మరో ఎయిర్లైన్ నుంచి వీల్ఛైర్ను తీసుకొచ్చి తనను తీసుకెళ్లారని ఖుష్బూ ట్విటర్లో వెల్లడించారు. ఖుష్బూ చేసిన ట్వీట్కు ఎయిరిండియా స్పందిస్తూ క్షమాపణలు తెలియజేసింది. ‘‘మా వల్ల మీకు ఎదురైన అనుభవానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని వెంటనే చెన్నై ఎయిర్పోర్టు టీమ్ దృష్టికి తీసుకెళ్తాం’’ అని ఎయిర్లైన్ బదులిచ్చింది. ఖుష్భూ ట్వీట్కు నెటిజెన్లు మద్దతు తెలుపుతున్నారు.