భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ ముదల్కర్, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావుఎన్నికయ్యారు. గురువారం రాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల అధికారులు ఫలితాలను శుక్రవారం రిలీజ్ చేశారు. అధ్యక్ష పదవికి కిరణ్ కుమార్, లక్కినేని సత్యనారాయణ మధ్య పోటీ జరగగా, 30 ఓట్లతో కిరణ్కుమార్ విజయం సాధించారు.
ఉపాధ్యక్షుడిగా షేక్ షాజహాన్ పర్వీన్, కాటూరి సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు, సంయుక్త కార్యదర్శిగా గడదాసు నాగరాజు, గ్రంథాలయ కార్యదర్శిగా దొడ్డ ప్రసాద్, కోశాధికారిగా జి. సంధ్యారాణి, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శులుగా బానోత్ దేవదాస్, నకిరికంటి ఉమ ఎన్నికయ్యారు. మహిళా రిప్రజెంటేటివ్గా మల్లెల ఉషారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
