పాట పాడిన కేంద్రమంత్రి.. సోషల్ మీడియాలో వైరల్

పాట పాడిన కేంద్రమంత్రి.. సోషల్ మీడియాలో వైరల్

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. యోగా ఆసనాలు, ఫిట్ నెస్ లోనూ ప్రతిభావంతుడుగా అందరికీ తెలుసు. కానీ లేటెస్ట్ గా తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టాడు. ఓ ప్రోగ్రామ్ లో తనలోని గాయకుడిని పరిచయం చేశాడు. ఆదివారం ముస్జూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో అరుణాచల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్‌ల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో కొత్త బ్యాచ్ సివిల్ సర్వంట్ లకు  ఆతిథ్యం ఇచ్చాడు. ప్రసంగం తర్వాత యువ బ్యూరోక్రాట్‌లను అలరించడానికి రిజిజు  పాటను పాడి అందరిలో ఉత్సాహం నింపాడు.  అమితాబ్ బచ్చన్ నటించిన 1981 బాలీవుడ్ చిత్రం యారాణా నుండి ..తేరే జైసా యార్ కహాన్‌ పాటను పాడి ఉత్సాహపరిచాడు. ఇపుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ వీడియోను రిజిజు  ట్విట్టర్‌లో  పోస్ట్ చేశారు.   IAS, ఎలైట్ ఆఫీసర్‌ల కోసం ప్రీమియర్ అకాడమీలో మొట్టమొదటి కస్టమైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత యువ, తెలివైన అరుణాచల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్‌లను సంతోషపెట్టడానికి ఈ పాట పాడానని చెప్పారు.

see more news

 

కాలేజీలో గొడవ..విద్యార్థిని బిల్డింగ్‌ పై నుంచి తోసేసిన తోటి విద్యార్థులు

డాక్టర్ లేడని నర్సుల వైద్యం.. పుట్టిన పసికందు మృతి