ఉజ్జయినీ అమ్మవారికి కిషన్ రెడ్డి వెండి బోనం…

ఉజ్జయినీ అమ్మవారికి కిషన్ రెడ్డి వెండి బోనం…

సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన ఉజ్జయినీ అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. ఉజ్జయినీ అమ్మవారికి బోనాల పండుగ మొదలై ఇప్పటికీ 206సంవత్సరాలు పూర్తి అయిందని అన్నారు. ఈ సంవత్సరం దాదాపు 30లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు.

ఈ రెండు వారాలు హైదరాబాద్ తో పాటు.. మొత్తం తెలంగాణలో ప్రజలు బోనాల పండుగను ప్రజలు జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. బోనాల పండుగ యావత్ దేశంలో తెలంగాణకే ప్రత్యేకమైందని చెప్పారు.అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజలకు ఉండాలని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకువెెళ్లాలని ఆయన అమ్మవారని ప్రార్థించినట్లు చెప్పారు.