
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఖైరతాబాద్,వెలుగు: నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి దేశ ప్రధాని అయిన ఘనత మోదీకే దక్కిందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచార కుట్రలు చేశాయని ఆరోపించారు. హైదరాబాద్సెంట్రల్జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం ఆదివారం సోమాజిగూడలోని జయ గార్డెన్ లో జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, కాంగ్రెస్తప్పుడు ప్రచారం చేసిందన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని వార్డులను చేజిక్కించుకుని బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ హైదరాబాద్సెంట్రల్జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌథమ్ రావ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మహంకాళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్గౌడ్, అట్లూరి రామకృష్ణ,ఎల్.దీపక్రెడ్డి పాల్గొన్నారు.