
కొడంగల్, వెలుగు: లిఫ్ట్అడిగి కారెక్కిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరాడు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన శివకుమార్ చారి(26) నారాయణపేట జిల్లా కోస్గిలో ఉండే స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్దామనుకున్నాడు. సోమవారం రాత్రి పరిగి వరకు బస్సులో వచ్చాడు. అక్కడ బస్సులు లేకపోవడంతో లిఫ్ట్ అడిగి కారులో ఎక్కాడు.
కొడంగల్ పట్టణ శివారులో ముందు వెళ్తున్న వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్ చారి అక్కడికక్కడే మృతిచెందగా, వెనక సీటులో కూర్చున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై తెలిపారు.