
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన కోల్కతా..14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జేసన్ రాయ్ (10: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రహ్మనుల్లా గుర్బాజ్ (18: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) 29 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
ఆదుకున్న అయ్యర్..
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు ఫోర్లు), కెప్టెన్ నితీష్ రాణా (22: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్కు ఇద్దరు 48 పరుగులు జోడించారు. అయితే ఈ స్థితిలో చాహల్ నితీష్ రాణాను పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్ (10: 10 బంతుల్లో, ఒక సిక్సర్) త్వరగానే ఔటయ్యాడు. రింకూ సింగ్ (16: 18 బంతుల్లో, ఒక సిక్సర్) విలువైన పరుగులు చేయలేకపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..వెంకటేష్ అయ్యర్ రాజస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వెంకటేష్ అయ్యర్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ త్వరగానే పెవీలియన్ చేరడంతో కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులే చేసింది. రాజస్తాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్కు 2 వికెట్లు దక్కాయి. సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్ చెరో వికెట్ తీశారు.