కేసీఆర్​బంధువులే బీఆర్ఎస్​ను నమ్ముతలేరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్​బంధువులే బీఆర్ఎస్​ను నమ్ముతలేరు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 హైదరాబాద్: సీఎం కేసీఆర్ బంధువులే కాంగ్రెస్ లో​చేరారని, బీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్ముతలేరని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో హస్తందే గెలుపన్నారు. భువనగిరిలో 40 ఏండ్ల చరిత్ర తిరగరాయాలన్నారు. నాయకుల కోసం కాకుండా 4 కోట్ల మంది ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు.  

తెలంగాణ ఇచ్చిందని ఆనాడు కాళ్లు మొక్కిన కేసీఆర్.. ఈనాడు  కాంగ్రెస్ గ్యారెంటీ లేని  పార్టీ అంటున్నారని విమర్శించారు. ఎంత కష్టపడాలన్న 33 రోజులు మాత్రమే ఉంది. పోలింగ్ వరకు ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తానన్నారు.  ఒక్కసారి కాంగ్రెస్ కు ఓటు వేయాలని.. తర్వాత ఐదేండ్లు మీ కోసం తాము కష్టపడతామని చెప్పారు. అనిల్ రెడ్డిని ఈ సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోమటిరెడ్డి కోరారు.

ALSO READ : మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్