మోడీ భుజం తట్టి.. డోంట్ వర్రీ మై దేక్ లేంగే అన్నడు: రాజగోపాల్

మోడీ భుజం తట్టి.. డోంట్ వర్రీ మై దేక్ లేంగే అన్నడు: రాజగోపాల్

హైదరాబాద్ లో బీజేసీ సభ ముగిసిన తర్వాత బేగంపేట ఎయిర్ పోర్ట్ లో పార్టీ నేతలతో  ప్రధాని నరేంద్ర మోడీ కాసేపు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్.. రాజగోపాల్ ను ప్రధానికి పరిచయం చేశారు. రాజగోపాల్ తో మోడీ రెండు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు.  మునుగోడు ఉప ఎన్నిక ఓటమిపై డోంట్ వర్రీ అంటూ భుజం తట్టారు. రాజగోపాల్ ను అభినందించి.. మై దేక్ లేంగే అంటూ మోడీ హామీ ఇచ్చారు.

ప్రధాని మోడీకి తనకు భరోసా ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మునుగోడులో నైతిక విజయం బీజేపీదే అని మోడీ తనతో అన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని మోడీ సూచించారన్నారు. మునుగోడులో వచ్చిన ఓట్లను బట్టి జనం బీజేపీ వైపు చూస్తున్నారని.. తనకు మోడీ భరోసా ఇచ్చారని అన్నారు.