బీఆర్ఎస్ హయాంలో.. దక్షిణ తెలంగాణ సర్వనాశనమైంది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలో.. దక్షిణ తెలంగాణ సర్వనాశనమైంది : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ సర్వనాశనం అయ్యిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించారు.పానగల్ లోని తాగునీటి శుద్ధ కర్మాగారాన్ని పరిశీలించిన కోమటిరెడ్డి అధికారులకు సూచనలు జారీ చేశారు. 

ఏఊరికి వెళ్లినా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. మిషన్ భగీరథతో నీళ్లిచ్చామని చెప్పడం అబద్ధమన్నారు. డిండి, SLBC పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేద కాదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రతి రోజు నలుగురు నేతలు పార్టీ మారుతున్నారని..తర్వలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు కోమటిరెడ్డి. అన్నివర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనేనన్నారు కోమటిరెడ్డి.