కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేం : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేం : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్/ఓయూ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేమని హైదరాబాద్ ​జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కొండా లక్ష్మణ్​ బాపూజీ 108వ జయంతి వేడుకలను బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ ఫొటోకు అనుదీప్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతికి బాపూజీ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ పాల్గొన్నారు. ఉస్మానియా వర్సిటీలో  తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి సదవారి సాయితేజ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నిర్వహించారు.

సామాజిక తెలంగాణ కావాలి: ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్: సామాజిక తెలంగాణ సాధనే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమిచ్చే ఘన నివాళి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. బుధవారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. బాపూజీ ఫొటోకు పూలమాల  వేసి నివాళులర్పించారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ..  తెలుగు తల్లి ఫ్లై ఓవర్​కు కొండా లక్ష్మణ్ పేరు పెట్టాలని కోరారు.