మోడీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు

మోడీని కలిసిన కొండా  విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఢిల్లీలో మోడీని కలిసిన సందర్భంగా తమ రెండో కుమారుడు విశ్వజిత్‌‌‌‌ పెండ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. తర్వాత రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు. ప్రధానితో భేటీలో తెలంగాణలో వైద్యం, విద్య అంశాలపై చర్చించామని విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్‌‌‌‌ చేశారు.

తాము చేపట్టిన టాయిలెట్ క్లీనింగ్, బయో గ్యాస్ ప్లాంట్ విషయాలను ప్రధానితో పంచుకున్నామని వెల్లడించారు. స్వచ్ఛ్ ట్రాక్ (టాయిలెట్ క్లీనింగ్) కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని మోడీ కోరారని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ రిపోర్ట్, ప్రాజెక్ట్ వివరాలు పంపుతామన్నారు. కాగా, బీజేపీ చీఫ్ నడ్డాను కలిసి పెండ్లి ఆహ్వాన పత్రికను అందిస్తామని ఆయన తెలిపారు.