
కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టే పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో బీజేపీ విజయ్ సంకల్ప సభలో మాట్లాడిన ఆయన.. వ్యాపారాలు చేసుకునే తనను రాజకీయాల్లోకి పిలిచింది కేసీఆరేనని చెప్పారు. కేసీఆర్ వి అన్నీ డైవర్ట్ దోపిడినేనని ఆరోపించారు. తెలంగాణలో అమలవుతోన్న పథకాలకు నిధులన్నీ కేంద్రానివేనన్నారు.
కేంద్రం నిధులన్నీ దోచేశారని.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయుష్మాన్ భరత్ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. భూ సేకరణ పూర్తికాకపోవడంతోనే చేవెళ్ల హైవే పూర్తి కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు.
ఫజల్ బీమా పథకం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రైతులకు ఫర్టిలైజేషన్ సబ్సిడీ ఏమైందన్నారు. చేవెళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. మిషన్ తెలంగాణ సక్సెస్ అవుతదన్నారు. తెలంగాణలో పంట నష్టం పరిహారం ఏదని.. రైతులకు సబ్సిడీ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.