అమరవీరులకు కోదండరాం నివాళులు

అమరవీరులకు కోదండరాం నివాళులు

పితృ అమావాస్య సందర్భంగా హైదరాబాద్ గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు TJS చీఫ్ ప్రొ. కోదండరాం. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి స్మృతి చిహ్నం నిర్మించాలని డిమాండ్ చేశారు.  అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించడం లేదని విమర్శించారు కోదండరాం. ప్రత్యేక రాష్ట్రంలో ప్రగతి భవన్ వచ్చింది కానీ అమరుల స్థూపం రాలేదన్నారు.