మాకు గెలుపోటములను నిర్ణయించే సత్తా ఉంది

మాకు గెలుపోటములను నిర్ణయించే సత్తా ఉంది

ఎల్​బీనగర్,వెలుగు: ఏ పార్టీని అధికారంలో ఉంచాలనే.. గెలుపోటములను నిర్ణయించే సత్తా తమ పార్టీలకు ఉందని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. నాగోల్ లోని నవ చేతన బిల్డింగ్ లో ఎల్​బీనగర్ నియోజకవర్గ జనరల్ బాడీ మీటింగ్ సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రచారి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇందులో పాల్గొన్న కూనంనేని మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ తన అవసరాలకు వాడుకుని.. ఆ తర్వాత కరివేపాకులా తీసేస్తాడనేది ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో ఎల్ బీనగర్ కమిటీని పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రకటించగా.. ఎల్ బీనగర్ కన్వీనర్ గా సామిడి శేఖర్ రెడ్డి, కో కన్వీనర్ గా భారత రాజు నరసింహ రామ్ నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా కార్యదర్శి డీజీ సాయిలు, పర్వతాలు, ధర్మేంద్ర పాల్గొన్నారు.