భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చెత్తకుప్పలకు నిలయంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రణాళిక చేపడుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు. కార్పొరేషన్ ఆఫీస్ చూట్టూ చెత్త కుప్పలు ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
