అమ్మానాన్నల కథగా 'రంగమార్తాండ'

అమ్మానాన్నల కథగా 'రంగమార్తాండ'

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగమార్తాండ'. ఈ చిత్ర టైటిల్ లోగోను తాజాగా విడుదల చేశారు చిత్ర బృందం. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, ఎస్. వెంకటరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటిస్తున్నారు. 

ఇక 'రంగమార్తాండ' సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథగా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ మూవీ ఉండనుంది. కృష్ణవంశీ కెరీర్ లో 21వ సినిమాగా ఈ చిత్రం విడుదల కానుంది.

దర్శకత్వం : కృష్ణవంశీ
నిర్మాత : కాలిపు మధు, వెంకట్ రెడ్డి
సంగీతం : ఇళయరాజా
ఎడిటర్ : పవన్
కెమెరామెన్ : రాజ్ కె నల్లి