బషీర్బాగ్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలను మోసం చేసే విధంగా ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. దేశంలో 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు రూ. 20 వేల కోట్లు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ బడ్జెట్ను సవరించి బీసీలకు రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. శనివారం కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆర్. కృష్ణయ్య చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు గువ్వల భరత్, గుజ్జ సత్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 8 , 9 తేదీల్లో చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ పోస్టర్ను శనివారం రవీంద్రభారతిలో ఆయన ఆవిష్కరించారు.