కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి : కేఎస్ రత్నం

కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి :  కేఎస్ రత్నం

చేవెళ్ల, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఆదరించిన చేవెళ్ల ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే అభివృద్ధి పథంలో నడిపిస్తానని  చేవెళ్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్​ రత్నం అన్నారు.  సోమవారం నియోజకవర్గంలోని  ఆలూరు, నాన్ చేరు, ఖానాపూర్  రేగడి  ఘనాపూర్, దేవరంపల్లి, అల్లవాడ, గుండాల, పల్గుట్ట, కందవాడ, నారాయణ దాసుగూడ,చన్వెల్లి, ఇక రెడ్డి గూడ, పామెన  తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలోని  పల్లెలు, పట్టణాల్లో  అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు.  బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు.  పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా బీజేపీ మేనిఫెస్టో ఉందన్నారు.  అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు.  మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, పార్టీ నేతలు చాకలి శ్రీనివాస్​బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.