నేడు బీఆర్ఎస్ ఎలక్షన్ ఇన్​చార్జుల మీటింగ్

 నేడు బీఆర్ఎస్ ఎలక్షన్ ఇన్​చార్జుల మీటింగ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ అసెంబ్లీ ఎన్నికల వార్ రూమ్​ఇన్​చార్జులతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమావేశం కానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి హాజరుకావాలని అన్ని నియోజకవర్గాల ఇన్​చార్జులకు సమాచారం ఇచ్చారు.

స్టేట్​ వార్​రూమ్​ ఇన్​చార్జులు సహా పార్టీ ఎలక్షన్​ఇన్​చార్జులకు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉంది? దాన్ని ఎలా డిఫెండ్ ​చేయాలి? బీఆర్ఎస్​ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? తదితర అంశాలపై కేటీఆర్, హరీశ్​రావు దిశా నిర్దేశం చేయనున్నారు.