మత్తు పదార్థాలకు నేను వ్యతిరేకం.. డ్రగ్స్‌‌‌‌ తో దొరికిన వారిని చట్టపరంగా శిక్షించాలి: కేటీఆర్

మత్తు పదార్థాలకు నేను వ్యతిరేకం.. డ్రగ్స్‌‌‌‌ తో దొరికిన వారిని చట్టపరంగా శిక్షించాలి: కేటీఆర్
  • నీచరాజకీయాల కోసం డ్రగ్స్​ కేసులోకి నన్ను, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ​పార్టీని లాగుతారా?..​ లీగల్​ నోటీసులిస్తా
  • డ్రగ్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ విషయంలో పీసీసీ చీఫ్‌‌‌‌ సూచనను స్వాగతిస్తున్నానని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: మనుషులను డ్రగ్స్​ మహమ్మారి రాక్షసులుగా మారుస్తుందని, బాధ్యతగల పొజిషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నోళ్లు కూడా డ్రగ్స్​ తీసుకోవడం దురదృష్టకరమని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. డ్రగ్స్​, ఇతర మత్తుపదార్థాల వాడకానికి తాను తీవ్ర వ్యతిరేకమని చెప్పారు. బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డి డ్రగ్స్​ తీసుకుంటూ దొరికిన ఘటనపై ఆదివారం కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పందించారు.

డ్రగ్స్​ వినియోగం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్​ తీసుకునేవారిని, వాటిని సరఫరా చేసేవారిని ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు.  కానీ, నీచరాజకీయాల కోసం ఈ డ్రగ్స్​ వ్యవహారంలోకి అనవసరంగా తనను, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ పార్టీని లాగడమేంటని ఆయన ప్రశ్నించారు. 

ఎలాంటి డ్రగ్స్​ టెస్టుకైనా తాను సిద్ధమేనని ఇప్పటికే స్పష్టం చేశానని చెప్పారు. తనను డ్రగ్స్​ కేసులోకి లాగాలని చూస్తే చట్టపరంగా నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్ని రాజకీయపార్టీల నేతలు డ్రగ్స్​ టెస్ట్​ చేయించుకోవాలన్న పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ సూచనను స్వాగతిస్తున్నానని తెలిపారు.