
హైదరాబాద్ సిటీ, వెలుగు: దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దశదిన కర్మను బుధవారం సిటీలోని జేఆర్ సీ కన్వెన్షెన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ఎమ్మెల్యేలు హాజరై గోపీనాథ్ కు నివాళులర్పించారు. మాగంటి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు.