మతం పేరుతో ప్రజలను విడగొడుదామని చూస్తున్నరు: కేటీఆర్

మతం పేరుతో ప్రజలను విడగొడుదామని చూస్తున్నరు: కేటీఆర్
  • దేశంలో తెలంగాణ 30 % అవార్డులు గెలుచుకుంటున్నదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: మతం, కులం పేరుతో పనికిమాలిన పంచాయితీలు పెడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘‘నిన్న ఒకాయన వచ్చిండు.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అవతల పారేసి వాళ్లను అర్జంట్‌‌‌‌‌‌‌‌గా అధికారంలోకి తేవాలన్నడు. మతం పేరుతో ప్రజలను ఎలా విడగొడుదాం? ఎలా చిచ్చుపెడుదామని వాళ్లు చూస్తున్నారు” అని మండిపడ్డారు. సోమవారం ఆదివాసీ బంజారా భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సీఎం ఎంటర్​ప్రెన్యూర్​షిప్​అండ్​ఇన్నోవేషన్​స్కీం, ఎస్టీ మైక్రో స్మాల్​అండ్​మీడియం ఎంటర్​ప్రైజెస్ స్కీంల లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. ‘‘తొమ్మిదేండ్లలో తెలంగాణ లెక్క అభివృద్ధి చెందిన ఇంకో రాష్ట్రాన్ని దేశంలో చూపించమని మేం అడిగినం. తలసరి ఆదాయంలో మేం నంబర్​వన్​గా ఉన్నామని ఆర్​బీఐ చెప్పింది. దాన్ని ప్రధానో, ఇంకెవరో ఎందుకు మాట్లాడరు? దేశ జనాభాలో మూడు శాతం కన్నా తక్కువ జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం అవార్డులు గెలుచుకున్నది నిజం కాదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

నేను ముసలోడిని అయిపోయా

‘‘తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు కేసీఆర్ గొప్పోడు కాదు.. వాక్​శుద్ధి.. చిత్తశుద్ధి.. లక్ష్యశుద్ధి ఉంది కాబట్టే తెలంగాణ సాధించగలిగారు” అని కేటీఆర్ చెప్పారు. తాను ముసలోడిని అయ్యాయని మరోసారి కేటీఆర్​ కామెంట్​ చేశారు. ‘‘నేను ముసలోడిని అయిపోయిన.. 47 ఏండ్లు వచ్చినయి.. జుట్టు కూడా తెల్లబడ్డది.. రంగు ఏసుకున్న” అని అన్నారు. 90 ఏళ్లు ఒకెత్తు అయితే.. ఈ తొమ్మిదేళ్ల పాలన ఇంకొక ఎత్తు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగమని చెప్పారు.