మోడీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్

మోడీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: వరుస ట్వీట్లతో బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్న మంత్రి కేటీఆర్... తన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సారి ప్రధాని మోడీ, ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశంలోని పలువురు ప్రతి పక్ష నాయకులు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ద‌ర్యాప్తు సంస్థల దాడులకు గురికావడం సర్వసాధారణంగా మారిందని కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. శ్రీలంక ప‌వ‌న విద్యుత్ కాంట్రాక్టుల్లో ప్రధాని మోడీ జోక్యం ఉంద‌ని ఆ దేశ సీనియ‌ర్ అధికారులే ఆరోపిస్తున్నారని, మ‌రి దీనిపై ప్రధాని మోడీ, అదానీ ఎందుకు స్పందించ‌డం లేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో మీడియా కూడా సైలెంట్ గా ఉంటోందని కేటీఆర్ తెలిపారు.