హైదరాబాద్/ మెహిదీపట్నం, వెలుగు: పాతబస్తీ మదీనా చౌరస్తాలోని షాదాబ్ హోటల్కు శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఎలాంటి ప్రొటోకాల్, సెక్యూరిటీ లేకుండా సాదాసీదాగా వెళ్లిన ఆయన్ని.. ముందుగా అక్కడున్న వాళ్లు ఎవరూ గుర్తు పట్టలేదు. చైర్ మీద కూర్చొని బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు చుట్టుపక్క వాళ్లు చూసి ఆశ్చర్యపోయారు.
బిర్యానీతో పాటు పలు రకాల హైదరాబాదీ వంటకాలను కేటీఆర్ రుచి చూశారు. రెస్టారెంట్ యాజమాన్యం ఆయనకి స్పెషల్ డిషెస్ వడ్డించారు. తర్వాత హోటల్లోని కస్టమర్లతో కేటీఆర్ మాట్లాడారు. షాదాబ్ హోటల్ నుంచి బయటికొచ్చిన కేటీఆర్.. మోజాంజాహి మార్కెట్ వద్ద ఫేమస్ ఐస్క్రీమ్ పార్లర్కు వెళ్లారు. అక్కడి కస్టమర్లతో మాట్లాడి.. సీతాఫల్, చీకు ఫ్లేవర్ ఐస్క్రీమ్లు రుచి చూశారు.