
పద్మశ్రీ మల్లేశం జీవితం ఆధారంగా తెరెకెక్కుతున్న సినిమా ‘మల్లేశం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యునిట్. ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా.. మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. “మల్లేశం సినిమా ఫస్ట్ లుక్ ను షేర్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి పనిచేస్తున్న వారందరికీ ఆల్ ది బెస్ట్” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే మూవీ లోగో కేటీఆర్ చేతులమీదుగా లాంచ్ అయింది.
భువనగిరి జిల్లాకు చెందిన మల్లేశం.. చేనేత వస్త్రాలను సులభంగా తయారు చేయడానికి యంత్రాన్ని కనుగొన్నారు. వీరి ప్రతిభను మెచ్చిన కేంధ్ర ప్రభుత్వం 2017 లో ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటిస్తుండగా..అనన్య, ఝాన్సీ, చక్రపాణి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. స్టూడియో-99 ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో.. రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మార్క్ కే రోబిన్ సంగీతం అందిస్తున్నారు. గోరంటి వెంకన్న, చంద్రబోస్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు.
Happy to present you the first look of #Mallesham #ExtraordinaryStoryOfAnOrdinaryMan from #Telangana
Wishing @MalleshamMovie team all the very best! pic.twitter.com/Nvkx0N9ZWa— KTR (@KTRTRS) February 3, 2019