
కుభీర్, వెలుగు: రెండు నెలలుగా తమకు జీతాలు రావడం లేదని కుభీర్ గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. జీతం ఇవ్వకపోతే పనులకు వెళ్లే ప్రసక్తే లేదని
భీష్మించుకొని కూర్చున్నారు. అనంతరం మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్ను కలిసి సమస్య విన్నవించారు. నిత్యవసరాలు కూడా తెచ్చుకోవడానికి డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దండం పెడతాం సార్ మాకు జీతాలు ఇప్పించండి’ అంటూ వేడుకున్నారు. సమయానికి డబ్బులు ఇవ్వకపోగా గ్రామపంచాయతీ అధికారులు తమను వేధిస్తున్నారని, లీవుల పేరుతో డబ్బులు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎవరికీ జీతాలు లేదని స్పెషల్ ఆఫీసర్ సముదాయించారు. డబ్బులు కట్ చేయకుండా చూస్తామని చెప్పారు. త్వరలోనే డబ్బులు
విడుదలవుతాయని డీపీవో శ్రీనివాస్ చెప్పడంతో శాంతించి వెళ్లిపోయారు.