సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిమ్స్ ఆస్పత్రిలో దీక్ష విరమించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కూనంనేని నిరవధిక దీక్ష చేపట్టారు. నిమ్స్లో కూనంనేనికి సురవరం, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. మగ్థుం భవన్ దగ్గర చేపట్టిన కూనంనేని దీక్షకు పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. కూనంనేని మాత్రం ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగించారు.