రెప్పపాటు సమయంలో రైలు కింద పడుతుండగా..

రెప్పపాటు సమయంలో రైలు కింద పడుతుండగా..

అహ్మదాబాద్: రైలు నుంచి జారిపడిన ఓ మహిళను రైల్వే మహిళా కానిస్టుల్ కాపాడింది. ఈ సంఘటన బుధవారం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కడానికి మహిళ ప్రయత్నించింది. అయితే.. ఆమె పట్టుతప్పి.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో పడబోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ మందాకిని గమనించి ఆమెను రెప్పపాటులో రక్షించింది. కానిస్టేబుల్ కు తోడుగా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు సాయం చేయడంతో ప్రయాణికురాలు ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.చాకచక్యంగా వ్యవహరించి మహిళను రక్షించిన కానిస్టేబుల్‌ మందాకినిని నెటిజన్లతోపాటు, అధికారులు ప్రశంసించారు. ఆర్‌పీఎఫ్ ఇండియా అఫీషియల్ ట్వీట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. చాలా మంది నెటిజన్లు కానిస్టేబుల్‌ను అభినందిస్తున్నారు.