రుణమాఫీ కోసం సీఎంకు లక్ష ఉత్తరాలు

రుణమాఫీ కోసం సీఎంకు లక్ష ఉత్తరాలు

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: రెండోసారి సీఎంని చేస్తే తొలి సంతకం లక్ష రూపాయలు రైతుల రుణమాఫీపైనే అని 2018లో ప్రగల్బాలు పలికిన కేసీఆర్​ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆదిలాబాద్​జిల్లా బీజేపీ ప్రెసిడెంట్​పాయల్​శంకర్ డిమాండ్​చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సీఎంకు లక్ష ఉత్తరాలు రాస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం బేల మండలంలోని డోప్టాల   రైతులు లెటర్లు రాసి పంపించారు. ఈ యేడు పత్తి, సోయా రైతులు తీవ్రంగా నష్టపోయారని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఈ టైంలో ఆదుకోవాల్సి బాధ్యత సర్కారుదేనన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. స్పందించకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ ఠాక్రే, సర్పంచ్​రాకేష్ తదితరులు పాల్గొన్నారు.