జైపూర్: రాజస్థాన్ జైపూర్లోని ఓ చోట ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల బ్లాక్మనీతో పాటు 50 కిలోల బంగారం దాచారని బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. గణపతి ప్లాజాలో ఐటీ అధికారులు సోదాలు జరపగా లాకర్లలో లక్షల రూపాయలు బ్లాక్మనీ పట్టుబడింది.
ఇటీవల బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ స్కామ్కు చెందిన వందల కోట్లను జైపూర్లోని గణపతి ప్లాజాలో దాచారని ఆరోపించారు. దీంతో ఐటీ అధికారులు అక్టోబర్ 17న 3 లాకర్లు తెరిచి రూ.30 లక్షలు, 21న రూ.2.46 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.7 కోట్లు, 12 కేజీల బంగారాన్ని లాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.