లాకర్లలో బ్లాక్​మనీ!.. జైపూర్​లో ఐటీ సోదాలు

లాకర్లలో బ్లాక్​మనీ!..   జైపూర్​లో ఐటీ సోదాలు

జైపూర్: రాజస్థాన్​ జైపూర్​లోని ఓ చోట ప్రైవేటు లాకర్లలో రూ.500 కోట్ల బ్లాక్​మనీతో పాటు 50 కిలోల బంగారం దాచారని బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. గణపతి ప్లాజాలో ఐటీ అధికారులు సోదాలు జరపగా లాకర్లలో లక్షల రూపాయలు బ్లాక్​మనీ పట్టుబడింది. 

ఇటీవల బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ స్కామ్​కు చెందిన వందల కోట్లను జైపూర్​లోని గణపతి ప్లాజాలో దాచారని ఆరోపించారు. దీంతో ఐటీ అధికారులు అక్టోబర్ 17న 3 లాకర్లు తెరిచి రూ.30 లక్షలు, 21న రూ.2.46 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.7 కోట్లు, 12 కేజీల బంగారాన్ని లాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.