క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రిమ్స్ నుంచి ఎయిమ్స్ కు షిప్ట్..

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రిమ్స్ నుంచి ఎయిమ్స్ కు షిప్ట్..

కిడ్నీలు దెబ్బతినడంతో  రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ ను అంబులెన్స్ లో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించనున్నారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించాలని రిమ్స్ తరపున హాట్వర్ జైలుకు లేఖ రాశారు. లేఖలో, లాలూ యాదవ్ ఆలస్యం చేయకుండా ఎయిమ్స్ పంపమని కోరారు.

ఇవాళ లాలు కుటుంబ సభ్యులు రాంచీలోని  రిమ్స్ ఆస్పత్రికి  వెళ్లారు. భార్య రబ్రీదేవి, కొడుకు  తేజస్వీ, కుమార్తె మీసాభారతి లాలు  ఆరోగ్యం  గురించి   డాక్టర్లను అడిగి  తెలుసుకున్నారు. లాలుకు  మంచి ట్రీట్ మెంట్ అందించాలని  కోరారు   తేజస్వియాదవ్.  రిపోర్టులు వచ్చాక  ఎలాంటి  ట్రీట్ మెంట్ అందిస్తారో  డాక్టర్లే   చెప్పాలన్నారు. ప్రస్తుతం  లాలు ఆరోగ్య   పరిస్థితి ఆందోళనకరంగా  ఉందన్నారు. దీనిపై సీఎం  నితీష్ కుమార్ తో  మాట్లాడతానన్నారు  తేజస్వియాదవ్.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ..

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం