
ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్ పరిస్థితి విషమంగానే ఉందన్నారు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి డాక్టర్లు. ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ తో ఆమె బాధపడుతున్నారు. న్యుమోనియాతో లతా మంగేష్కర్ బాధపడుతున్నారని డాక్టర్ ప్రతీత్ సందానీ తెలిపారు. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను వెంటిలేటర్ పై ఉంచి, ట్రీట్ మెంట్ అందిస్తున్నామని చెప్పారు. అయితే గత కొన్ని గంటలుగా ఆమె పరిస్థితి కొంత మెరుగైందని తెలిపారు.డాక్టర్ల పరిశీలనలోనే మరికొన్ని రోజుల పాటు ఆమె ఉండాలని చెప్పారు.
లత వయస్సును దృష్టిలో ఉంచుకుని తాము ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని డాక్టర్ ప్రతీత్ తెలిపారు. హై డోస్ యాంటీబయోటిక్స్ ఇస్తున్నామని చెప్పారు. నిన్న తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.