సీతాఫల్మండి, వెలుగు: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్తెలిపారు. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో బీజేపీ నాయకురాలు మేకల కీర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.
అనంతరం మహిళలకు కుట్టు మెషీన్లు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలపడేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.